గుండాల జూన్ 13(మన్యం మనుగడ) జలగం ట్రస్ట్ సేవలు రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు, సోమవారం జలగం ట్రస్ట్ చైర్మన్ మాజీ మంత్రి జలగం ప్రసాదరావు మండలంలో పర్యటించారు, మండలంలో ఉన్న రైతులు బోర్, నదీ పరివాహక ప్రాంతంలో పట్టా కలిగిన రైతులు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలన్నారు. కొంత రైతు చెల్లిస్తే మిగతాది జలగం ట్రస్టు ద్వారా కంపెనీకి కట్టి విద్యుత్ మోటార్లను అందజేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు అందిస్తున్నామన్నారు. మండలంలో గిరిజన రైతులు పెద్ద మొత్తంలో ఉన్నారని తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జలగం ట్రస్ట్ చైర్మన్ మాజీ ముఖ్యమంత్రి ప్రసాదరావు, ఎంపీపీ సత్యం, ఎంపీడీవో హజరత్ వలి, తాసిల్దార్ కిషోర్, విద్యుత్ శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: