మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఎం డి జాని అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యానికి ఖర్చులు భరించలేని స్థితిలో పాండురంగాపురం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నాయకులు చెన్నకేశవులు, నరేష్ దొరల దృష్టికి తీసుకెళ్లగా వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకి జానీ సమస్యను విన్నవించారు. తక్షణమే స్పందించిన పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు జాని వైద్య ఖర్చుల కొరకు లక్ష రూపాయలు ఎల్వోసీ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా వారందరూ మనసున్న మారాజు మా నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు అని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
Post A Comment: