గుండాల/ఆళ్లపల్లి18(మన్యం మనుగడ) విద్యతోనే యువతకు బంగారు భవిష్యత్ ఉంటుందని ఆళ్లపల్లి ఎంపీపీ మంజు భార్గవి అన్నారు. శనివారం మండలం పరిధిలోని అనంతోగు గ్రామంలోగల కస్తూరిబా పాఠశాలలో బడి బాట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఉన్నత చదువులు చదవడం వలన బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. గతంలో పదవ తరగతి పాసైన విద్యార్థులను పిలిపించి సన్మానించారు. ఒక్క చదువుతోనే తమ జీవితానికి బంగారు బాటలు వేసుకోవచ్చు అని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ కృష్ణయ్య , ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు
Post A Comment: