గుండాల జూన్ 26(మన్యం మనుగడ) ప్రజా పందా రాష్ట్ర కార్యదర్శి డి వి కృష్ణారెడ్డి కి విప్లవ జోహార్లు గుండాల ఎంపీపీ సత్యం అన్నారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ లో మరణించడం బాధాకరమన్నారు. ఆయనకు నీవు డెమోక్రసీ పార్టీ ఘన నివాళులు అర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. నక్సల్బరీ , గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమాల పూర్తి తో తన ఉద్యోగానికి రాజీనామా చేసి చండ్రపుల్లారెడ్డి నాయకత్వంలో నక్సల్బరీ ఉద్యమం లోకి అడుగులు వేశాడు అన్నారు. న్యూ డెమోక్రసీ పార్టీలో కేంద్ర నాయకుడిగా ఎదిగి అనేక ఉద్యమాలను ముందుండి నడిపించారన్నారు. ఆయన మరణం విప్లవ ఉద్యమాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల సర్పంచ్ సీతారాములు, పి వై ఎల్ నాయకులు రవి, వై వెంకన్న, పెంటన్న, బాబు, కృష్ణ , లాలయ్య తదితరులు పాల్గొన్నారు
Post A Comment: