మన్యం మనుగడ వెబ్ డెస్క్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రైటర్ బస్తి ప్రభుత్వ విప్ కార్యాలయం నందు అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు శ్రీ గొర్రె ముచ్చు వెంకట రమణ గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో మంజూరైన బొలెరో వాహనాన్ని... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు & భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా శ్రీ రేగా కాంతారావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది...
👉 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
👉 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు, దశాబ్దాలుగా అనగారిన దళితుల జీవితాల్లో వెలుగులు నింపి శాశ్వతంగా వారి పేదరికాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు...
👉 అంబేద్కర్, జ్యోతిబా పూలే కలలను సహకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చారన్నారు, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు, దళితులు బంధును సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు...
👉 అన్ని వర్గాలను సమానంగా చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు...
👉70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ ఒక్క నాయకుడు కూడా దళితుల గురించి పట్టించుకోలేదని, నేడు సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు...
👉 ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: