CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలి :- మరణించిన విద్యార్థికి 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలి పి వై ఎల్ నాయకులు రవి..

Share it:

 


గుండాల జూన్ 17(మన్యం మనుగడ) కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేసి పోలీస్ కాల్పుల్లో మరణించిన విద్యార్థి కుటుంబానికి యాభై లక్షల నష్ట పరిహారం చెల్లించాలని పి వై నాయకులు రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్నిపథ్ ఈ పథకం వల్ల లక్షల మంది ఉద్యోగులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వీడి తక్షణమే పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటన విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు. విద్యార్థులకు నష్టం వాటిల్లే పనులను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా మానుకోవాలని డిమాండ్ చేశారు

Share it:

TS

Post A Comment: