CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఈ నెల 28 నుండి రైతు బంధు జమ..

Share it:


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

రాష్ట్రంలో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు..రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి 10వేల చొప్పున ఇప్పటి వరకు రూ.50447.33కోట్లు రైతుల ఖాతాలో జమచేసినట్లు మంత్రి వివరించారు.రైతు బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు 83118 మంది రైతు కుటుంబాలకు 4150.90కోట్లు పరిహారం అందజేసినట్లు పేర్కొన్నారు.

*ఒక్కో ఎకరా పెంచుకుంటూ ఆరోహణ క్రమంలో..:* ఎకరాకు 5వేల చొప్పున తక్కువ భూవిస్తీర్ణం కలిగిన వారితో ప్రారంభించి ఆరోహణా క్రమంలో సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ఇవాళ ఒక ఎకరం లోపుతో ప్రారంభించి రోజుకు ఒక ఎకరా చొప్పున పెంచుకుంటూ పోతారు. *మంచిరోజు అన్న ఉద్దేశంతో శుక్రవారం రోజే పది మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు.* వచ్చే నెల మొదటి వారంలో రైతుబంధు చెల్లింపుల ప్రక్రియ పూర్తి కానుంది

Share it:

TS

Post A Comment: