గుండాల జూన్ 12(మన్యం మనుగడ) మండలం పరిధిలోని చీమల గూడెం గ్రామానికి చెందిన కల్తీ భవాని ఎంబీబీఎస్ సీటు సాధించడంతో ఆదివాసి హెల్ప్ లైన్ ద్వారా 25 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇల్లందు పట్టణంలో భవానికి అందజేశారు. అనంతరం ఆదివాసి హెల్ప్ లైన్ వ్యవస్థాపకులు కబ్ ఆకుల రవి మాట్లాడుతూ. ఈ హెల్ప్ లైన్ ద్వారా అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు గిరిజన బిడ్డ ఎంబిబిఎస్ చదువు పూర్తి చేయడం కోసం తమవంతు సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. గిరిజన లో ఎందరో ఆణిముత్యాలను ఉన్నారని సరైన ప్రోత్సాహం లేక చదువులు ముందుకు పోలేక పోతున్నారన్నారు. అలాంటివారికి ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ కిన్నెర నరసయ్య, హెల్ప్ లైన్ అధ్యక్షులు అంజయ్య, కోశాధికారి నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు రమేష్ బాబు, కృష్ణ , కార్యదర్శి భాస్కర్ రావు, హెల్ప్ లైన్ సభ్యులు రమేష్ , బాలరాజు, ఊకే పగడయ్య, వీరాబాయి,కల్తీ భవాని, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: