దమ్మపేట జూన్ 30 ( మన్యం మనుగడ ):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల పరిధిలో అంకెపాలెం గిరిజన గురుకుల విద్యార్థిని తేజవత్ భావన శ్రీ ఇంటర్ లో 984 మార్కులు సాధించి గిరిజన గురుకుల లో రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం సాధించిన విషయం విధితం. ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన భావన శ్రీ ని మంత్రి హైదరాబాద్ గురుకుల కార్యాలయం నందు ప్రతేకంగా అభినదించి,రూ.25,000 నగదు రూపాయలు ప్రోత్సాహకంగా మంత్రి అందచేశారు, విద్యార్థిని లు మంచి ఫలితాలు సాధించటానికి కృషి చేసిన ప్రిన్సిపాల్ పి.రత్న కుమారి ని ఉపాధ్యాయలను, సిబ్బంది ని మంత్రి ప్రతేకంగా అభినందిచారు, మంత్రి మాట్లాడుతూ కార్పొరేట్ చదువులను తలదన్నేల గిరిజన గురుకులలో విద్య అందుతుందని మంత్రి అన్నారు ఈ కార్యక్రమం లో గిరిజన సంక్షేమ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్త్, గురుకుల సెక్రటరీ శ్రీ రోనాల్డ్ రోస్ తదితరులు పాల్గున్నారు.
Post A Comment: