మన్యం మనుగడ ఏటూరు నాగారం
ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్, పరుగు పందెం పోటీలను గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించారు. ఈ పోటీలలో 12,14,16,18,20 సంవత్సరాల లోపు బాల బాలికలకు నిర్వహించారు. ఈనెల 16వ తేదీన హనుమకొండ జెఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొనుటకు ఎంపికైన క్రీడాకారులు శశాంక్, శ్రీకాంత్, అయుతుర్, నాగరాజు,ప్రవీణ్ కుమార్, ప్రశాంత్,ప్రచండ,తనుశ్రీ,అభిజ్ఞ, రాణి, స్రవంతి, ఐశ్వర్య, కరిష్మా, ప్రియాంక, అనురాధ లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ములుగు జిల్లా అథ్లెటిక్స్ అస్సోసియేషన్ ప్రధాన కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సయుక్త కార్యదర్శి నాగరాజు, స్థానిక కోచ్ కుమారస్వామి, పీఈటీలు శ్రీనివాస్, అవంతిక, స్వరూప, సదర్ లాల్, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
Post A Comment: