మన్యం టీవీ దుమ్ముగూడెం
దుమ్ముగూడెం మండలంలో ఈ నెల 14వ తేదీన బహుజన సమాజ్ పార్టీ రాజాధికార యాత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతుందని నాయకులు చెన్నం నాగరాజు సోడి వీరస్వామి సరియం భీమ్ లు తెలిపారు ఈనెల 13 నుండి 16వ తేదీ వరకు భద్రాచలం నియోజకవర్గం లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యాత్ర జరుగుతుందని అందులో భాగంగా దుమ్ముగూడెం మండలంలో ఈ నెల 14న యాత్ర నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు బిసి ఎస్టీ ఎస్సీ మైనారిటీలకు రాజ్యాధికారం సాధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ బహుజన రాజ్యాధికార యాత్రను చేపట్టారని వారు తెలిపారు భద్రాచలం నియోజకవర్గం లో ఈనెల 13 నుండి 88 వ రోజు యాత్ర కొనసాగుతుందని వారు తెలిపారు ఈ యాత్రలో ఏజెన్సీ ప్రాంతానికి చెందిన బడుగు బలహీన వర్గాలు అత్యధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పొడుతూరి రవీంద్ర ప్రసాద్ కొప్పుల నారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.
Post A Comment: