మన్యం మనుగడ కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామ పంచాయతీలో గల వెంకటాపురం,దేవరనాగారం, పాపాయిగూడెం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్, మాజీ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర వేరువేరుగా రైతు డిక్లరేషన్ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వేర్వేరుగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తే రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వ్యవసాయానికి పూర్వ వైభవం చేస్తూ వారి జీవితాల్లో వెలుగు నింపుతూ ఏమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణ మాఫీ చేస్తామని భూమి ఉన్న రైస్ తో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15 వేల రూపాయలు పెట్టుబడి సహాయం కింద అందిస్తామని తెలిపారు అలాగే భూమిలేని కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేల రూపాయలు ఇస్తామని వారు తెలిపారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు మూతపడిన చక్కెర కర్మాగారాలను పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని అన్నారు రు పంట నష్టపోయిన రైతులకు తక్షణమే నష్ట పరిహారం అందించి చేరుతా మన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ చందా. సంతోష్ కుమార్, కరకగూడెం సర్పంచ్ ఊకే. రామనాథం,మాజీ ఎంపిటిసి దుర్గం.సంజీవ,సీనియర్ నాయకులు గొగ్గల.నరసయ్య కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి నితిన్ మండల కార్యదర్శి చందా. నాగేశ్వరరావు,చందా.రతమ్మఈసం.కృష్ణ పోలెబోయిన సీతారాంబాయి, కొమ్ము.నాగేంద్రబాబు,సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: