దమ్మపేట మే 27 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలంలోని అప్పారావుపేట గ్రామంలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీ లో ప్రమాదవశాత్తు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆదివాసీ మహిళ దష్మీ ( 22 ) ఫ్యాక్టరీలో పడి దుర్మరణం చెందింది.అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని ,ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని,ఇందుకు కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని,బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని లేని చో పామాయిల్ ఫ్యాక్టరీ ముందు ధర్నా నిర్వహిస్తామని ఆదివాసీ జేఎసి మండల అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసీ జేఏసీ జాతీయ కార్యదర్శి కొరసా వెంకటేష్ దొర,కాసిన్ని వెంకటేశ్వరరావు,కుంజా చినబాబు,వాసం శ్రీను ,సోయం రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: