CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సమ్మర్ స్పెషల్ రుచికరమైన మామిడి పండ్లు ఇప్పుడు మీ ఇంటి వద్దకే ఆర్టీసీ కార్గో లో మామిడి పళ్ళను బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే పంపించబడును:మణుగూరు డిపో మేనేజర్ శ్రీనివాస రావు*.

Share it:


మన్యం టీవీ మణుగూరు:


టీఎస్ ఆర్టీసీ కార్గో లో బంగినపల్లి మామిడి పండ్ల ను బుక్ చేసుకుంటే మీ ఇంటి వద్దకే మామిడి పళ్ళను చేర్చబడునని మణుగూరు డిపో మేనేజర్ బి.శ్రీనివాసరావు గురువారం విలేకరులకు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఎంతో ప్రజాదరణ పొందిన జగిత్యాల బంగినపల్లి మామిడి పళ్ళు, ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేసుకున్న వారికి వారం రోజులలో ఇంటి వద్దకే మామిడి పళ్ళను పంపించబడును అని తెలిపారు.ఐదు,పది,పదిహేను కేజీల నుంచే పది టన్నుల వరకు బుక్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.5 కేజీల మామిడి పళ్ళ కు రూ.581 రూపాయలు,10 కేజీల కు రూ.1162 రూపాయలు 15 కేజీలకు రూ.1743 రూపాయలు చొప్పున ధర నిర్ణయించడం జరిగిందని అన్నారు.ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సహజసిద్ధంగా పండించిన మామిడిపళ్ళను మాత్రమే ఆర్టీసీ కార్గో ద్వారా సరఫరా చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.నిషేధిత కార్బైడ్ లాంటి రసాయన పదార్థాలను ఉపయోగించి పండించే మామిడిపండ్ల వైపు ప్రజలు మొగ్గు చూపకుండా, సహజసిద్ధంగా పండించి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మామిడి పండ్లను ఆర్టీసీ ద్వారా బుక్ చేసుకొని ఆర్టీసీ కార్గో ని ప్రజలు ఆదరించాలని డిపో మేనేజర్ శ్రీనివాస రావు కోరారు.ఆన్ లైన్లో బుక్ చేసుకోవాలనుకునేవారు, www.tsrtcparcel.in అనే వెబ్సైట్ ద్వారా లేదా డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సైదులు.ఫోన్ నెంబర్ 9154298588 కు సంప్రదించవచ్చని తెలిపారు.

Share it:

TS

Post A Comment: