CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గౌరవ హైకోర్టు ఆర్డర్లను అమలు పరచాలి.

Share it:


 ములకలపల్లి మన్యం మనుగడ ప్రతినిధి : మండల కేంద్రంలోని పూసు గూడెం గ్రామపంచాయతీలోని,పూసు గూడెం రెవిన్యూ పరిధిలోని 170,171, 172,సర్వే నెంబర్లు గల 8ఎకరాల 37 కుంటలు గల భూమిపై గౌరవ హైకోర్టు ఆర్డర్ల 12 01/2022, 575 / 2022,590/2022,592/2022 నెంబరు గల ఆర్డర్లు మాకు అనుకూలంగా ఇవ్వడం జరిగిందని, ఇట్టి విషయమై ములకలపల్లి తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించారు.ఆదివాసీ గిరిజన లైన ప్రజా ప్రతినిధులను సీతారాంపురం సర్పంచు ను కులం పేరుతో దూషిస్తూన్నారని పేర్కొనడం జరిగింది.కనుక ఈ సర్వేనెంబర్ లో గల భూమిని సంబంధిత గిరిజన రైతులకు ఈ భూమిపై హక్కు కల్పించాలని, తాసిల్దార్ కు తెలియజేయడం జరిగింది. అనంతరం తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.గిరిజనలైన మా భూమిని, గిరిజనేతరులు ఆక్రమించాలని ప్రయత్నాలు ప్రయత్నాలు చేస్తున్నారాని,కావున గౌరవ హైకోర్టు తీర్పును గౌరవించి మాకు సంబంధించిన భూములకు, మాకు రక్షణ కల్పించాలని, ప్రజా ప్రతినిధి అయిన సున్నం సుశీలను సర్పంచు ను కులం పేరుతో దూషించిన వారిని వెంటనే శిక్షించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సున్నం బాబురావు సడియం వీరస్వామి, సిపిఎం మండల సభ్యుడు ఉప సర్పంచ్ రమేష్,సున్నం చంటి,సున్నం కృష్ణ,సున్నం గోపాల్ రావు, సున్నం మహాలక్ష్మి,కొండ్రు విజయ,కొండ్రు ఆదినారాయణ, సోడే రమేష్, కీసరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: