మన్యం మనుగడ, మంగపేట.
జిల్లా సరిహద్దు గ్రామమైన దుగినేపల్లి శివాలయానికి నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ నుండి శ్రీ భార్గవ హీరో షోరూం మనుగూరు వారు రూపాయలు ఆరు వేల విలువగల మూడు సీలింగ్ ఫ్యాన్ లను గురు వారం బహుకరించారు వీటిని శివాలయంలో భక్తుల సౌకర్యార్థం మరియు గోశాలలో ఏర్పాటు చేసినట్లు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి తెలిపారు. శివాలయం అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఆలయ కమిటీ ని సాంబశివ రెడ్డి అభినందించారు శివాలయం అభివృద్ధికి వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుండి మరిన్ని సేవలు కొనసాగాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శివాలయానికి సీలింగ్ ఫ్యాన్లు ఇచ్చినందుకు వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి ని అభినందించారు ఈ కార్యక్రమంలో నాసిరెడ్డి నాగిరెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ ఉగ్గే సమ్మయ్య సభ్యులు భత్తుల నందకుమార్ యగ్గడి రాంబాబు పోకల కేశవయ్య శాతంశెట్టి సంతోష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: