CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పీ డీ ఎస్ యూ జిల్లా నిర్మాణ బాడీ నీ సమావేశాన్ని జయప్రదం చేయండి.

Share it:

 


గుండాల మే 14(మన్యం మనుగడ) ఇల్లెందు పట్టణంలో జరిగే పీ డీ ఎస్ యూ జిల్లా నిర్మాణ బాడీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పీ డీ ఎస్ యూ కొత్తగూడెం డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎనగంటి వంశి వర్ధన్, భానోత్ నరేందర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలోని వివేకవర్ధని కళాశాలలో విద్యార్థులతో జనరల్ బాడీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ప్రచారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించారు అన్నారు. పాలకుల అనుచిత నిర్ణయాలతో విద్యారంగం కుంటుపడుతుందని వారు అన్నారు. ఇటీవలే హైదరాబాదులో జరిగిన నాగరాజు హత్య మత ఆదిపత్య భావజాలానికి నిదర్శనమన్నారు. ప్రేమికులను సైన్యం చలేని ఉన్మాద స్థితికి దేశం దిగజారిందని వారు అన్నారు. కులాంతర వివాహాలు జరిగినప్పుడే మానవత్వం పరిమళిస్తుంది అని మహనీయులు చెప్పిన మాటలు అమలుకు నోచుకోవడం లేదని వారు అన్నారు. పీ డీ ఎస్ యూ నిరంతరం విద్యారంగ సమస్యలపై పోరాడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రణీత్, రవి, వంశీ, సాయి, తరుణ్, మౌనిక, శ్రుతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: