మన్యం మనుగడ వెబ్ డెస్క్:
మే 17న ఇల్లందు లో జరిగే పి డి యస్ యూ జిల్లా నిర్మాణ జనరల్ బాడీ ని జయప్రదం చేయాలని పి డి యస్ యూ ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎ. పార్థసారథి విద్యార్థులను కోరారు. ఈరోజు ఇల్లందు పట్టణ స్థాయి ముఖ్యుల సమావేశం పి డి యస్ యూ పట్టణ కోశాధికారి తరుణ్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్వీర్యం చేస్తూ తమ బాధ్యత నుండి వైదొలిగి కార్పొరేట్ విద్యా వ్యవస్థను బలోపేతం కై ప్రభుత్వాలు కృషి చేస్తున్న వైనం కనబడుతుందని అందులో భాగంగానే నూతన విద్యా విధానం తీసుకొచ్చి కార్పొరేట్ విద్యా వ్యవస్థను మరింత బలపరుస్తున్న దుర్మార్గ పరిస్థితిని పాలకులు కల్పిస్తున్న సమయంలో విద్యార్థులు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకునేందుకు పోరాటాలలో భాగస్వామ్యం కావాలని వారు అన్నారు.ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ చైతన్య నారాయణ నలంద విద్యా సంస్థల అధిపతులు ఇటివల కాలంలో పదవ తరగతి పేపర్ లీకేజ్ కి పాల్పడి విద్యార్థుల భవిష్యత్తును సర్వనాశనం చేసే ప్రక్రియకు పూనుకోవడమేనని వాటికి అనుసంధానంగా ఉన్న తెలంగాణలో నారాయణ విద్యాసంస్థల పై పూర్తి పరిశీలన కొనసాగించాలని ఆ విద్యా సంస్థలలో జరిగే విద్యార్థులపై ఒత్తిడి,అధిక ఫీజుల బారం, బోర్డ్ పరీక్షల ప్రశ్నాపత్రం లీకేజీ,విద్యార్థుల ఆత్మహత్యలు,మైనర్ విద్యార్థినిలపై లైంగిక వేధింపులు,తదితర అంశాల పట్ల ప్రభుత్వ అధికారులు ఎంక్వయిరీ చేసి నారాయణ విద్యాసంస్థలను సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లా నిర్మాణ జనరల్ బాడీ కి ప్రారంభ ఉపన్యాసకులుగా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య విద్యా రంగం పరిస్థితి విద్యార్థుల కర్తవ్యాలు బోధించేందుకు టి పి టి ఎఫ్ మాజీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి రామాచారి అదేవిధంగా పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్ నాగేశ్వరరావు,రాము లతోపాటు పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కాంపాటి పృద్వి పి డి యస్ యూ రాష్ట్ర కోశాధికారి కామ్రేడ్ కె. సంధ్య తదితరులు పాల్గొని ప్రసంగించడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో పిడిఎస్యు నాయకులు గుమ్మడి రవీనా ప్రణిత్ రాజ్, సాయి,కరుణాకర్ శరత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: