మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తం అందించడమే ఆప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ లక్ష్యమని ఆప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గొళ్ల రమేష్ అన్నారు. శనివారం తిప్పనపల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తికి మూడువేల రూపాయలు విలువ చేసే మందులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత మందులు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నాగరాజు పరిస్థితిని తెలుసుకొని మందులు అందజేయడం జరిగిందన్నారు. ఆపదలో ఉన్న వారికి ఆప్పీల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కాకటి బాబు, లక్ష్మణ్, తిరుపతి, సలీం,బాబా,జావిద్ నల్లబోతుల రవి,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: