మన్యం మనుగడ ఏటూరు నాగారం
శనగకుంట అగ్ని ప్రమాద బాధితులకు
దాతల సహకారంతో బాధితులైన 34 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి వంట పాత్రలు,స్టీల్ బియ్యం డ్రమ్ము,ట్రంక్ పెట్టె, చాపలు సీఐ కిరణ్ కుమార్ చేతుల మీదుగా అందించారు. బాధితులకు ఏమి అవసరమో తెలుసుకుని వారికి అవి అందించినందుకు బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినంద నీయమన్నారు. యూత్ సభ్యులను అభినందించారు.బాధితులలో ఒక కుటుంబం లో అమ్మాయి వివాహానికి దాచుకున్న 3లక్షల నగదు, 4 తులాల బంగారం మంటలలో బూడిద అయ్యాయి అని తెలపడంతో అమ్మాయి వివాహానికి 25000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని యూత్ అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగపేట ఎస్సై తాహెర్ బాబా, చైతన్య యూత్ గౌరవ సలహాదారులు జాస్తి శ్రీకాంత్, పెండ్యాల ప్రభాకర్, యూత్ అధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, సభ్యులు తాడూరి దీనభాందవ స్వామి,కత్తెర శ్రీనివాస్,పిట్టల శివ,గుండ్లపల్లి కార్తీక్,గుంత రమేష్,అలువాల శ్రీనివాస్,కాళ్ళ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: