గుండాల/ఆళ్ల పల్లి మే 2(మన్యం మనుగడ) మండలం పరిధిలోని మర్కోడు గ్రామానికి చెందిన నిరుపేద నజీమకు కాలు ఇన్ఫెక్షన్ బారిన పడడంతో కాలు తొలగించవలసిన పరిస్థితి దాపురించింది. ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో పెద్ద ఎత్తున ఖర్చు అవుతుందని నేపథ్యంలో మండల ప్రజలు వారి కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. అందులో భాగంగా మండల కేంద్రంలోని వ్యాపారస్తులు గౌరిశెట్టి శ్రీనివాస్ ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆమె కుటుంబానికి అందజేశారు. మంచి మనసుతో సహకరించిన శ్రీనివాస్ మండల ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఫాహిమ్, పాత్రికేయులు బూరుగడ్డ రాజు, పరమ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు .
Post A Comment: