మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని కూనవరం గ్రామ పంచాయతీ పరిధిలోని యన్టిఆర్ నగర్ లో ఆదివారం సాయంత్రం వచ్చిన గాలి వాన దుమారానికి దెబ్బ తిన్న ఇండ్ల ను,కూలిన,పగిలిన రేకుల ఇండ్ల ను ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు మణుగూరు జడ్పీటిసి పొశం. నరసింహారావు,రెవిన్యూ సిబ్బంది తో కలిసి పరిశీలించారు.అనంతరం బాధితులను పరామర్శించి ఓదార్చారు.ప్రభుత్వ విప్ రేగా. కాంతారావు ద్వారా బాధితులు కు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల జిల్లా కార్యదర్శి గుడిపూడి.కోటేశ్వరరావు,ఎంపీటీసీ సరిత,సర్పంచ్ ఏనిక. ప్రసాద్,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,పార్టీ నాయకులు రామారావు,పలు శాఖల అధికారాలు,రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: