ములకలపల్లి:(మే 28)మన్యం మనుగడ ప్రతినిధి :
మండలం లోని రైతు వేదిక వద్ద (60) కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట్రం లో ని కళ్యాణలక్ష్మి తో ప్రతి ఆడపడుచు వివాహనికి, ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ ఆసరాగా ఉంటున్నారని తెలిపారు.కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమం లో తాసీల్దార్ ఎల్ వీరభద్రం,నడిపల్లి సునంద, ములకలపల్లి సర్పంచ్ బీబీనేని భద్రం తదితరులు పాల్గొన్నారు.అనంతరం చాపరాలపల్లి గ్రామంలో తన్నీరు లోకేష్ ఇంట ఇటీవలే వివాహం జరగగా వారి నివాసానికి వెళ్లి నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమలాపురంగ్రామం,లో నమస్తే తెలంగాణ రిపోర్టర్ ముదిగొండ శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు మోరంపుడి అప్పారావు,సొసైటీ చైర్మన్ సునంద, ఎంపీపీ నాగమణి,సర్పంచ్ కుంజ నాగమణి,కారం సుధీర్,పామార్తి వెంకటేశ్వరరావు, నాగళ్ల వెంకటేశ్వరరావు,మంగపతి,రాజా రావు,ఉప సర్పంచ్ శనగపాటి అంజి, కరుటురి కృష్ణ, పాలకుర్తి ప్రసాద్, రాంబాబు, దుర్గ ప్రసాద్, అమర్నాథ్,నందమూరి సురేష్, శనగపటి రావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు తాటి ప్రవీణ్, టి ఆర్ ఎస్ వి అధ్యక్షులు గుంట్రు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: