ములకలపల్లి :(మే 28)మన్యం మనుగడ ప్రతినిధి :
మండల పరిధిలోని నల్లివారిగూడెం గ్రామానికి చెందిన షేక్ సలీం, రజియా దంపతుల కుమారుడుమూడేళ్ళ చిన్నారి హనీఫ్ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ హైదరాబాదులోని కేర్ వైద్యశాలలో శస్త్రచికిత్స చేయించారు. చిన్నారి తల్లిదండ్రులది పేదకుటుంబం కావడంతో, నూర్ బాషా సంఘం పాల్వంచ వారి ఆధ్వర్యంలో రూ. 21,000/- (ఇరవై ఒక్క వేలు)రూపాయలను నల్లివారిగూడెంలో చిన్నారి తల్లిదండ్రులకు అందించారు. నూర్ బాషా సంఘం రాష్ట్ర సలహాదారు షేక్ సైదులు ఆధ్వర్యంలో, పాల్వంచ పట్టణ గౌరవ అద్యక్షులు షేక్ ఖాసిం, అద్యక్షులు షేక్ కమాల్ చిన్నారి తల్లిదండ్రులను కలిసి ఆర్ధిక సహాయం అందజేయడమే కాకుండా, మునుముందుకూడా సంఘం ఆకుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. మంచి కార్యక్రమం చేపట్టి పేద కుటుంబానికి సహాయం అదించిన నూర్ బాషా సంఘం పాల్వంచ బాధ్యులను ప్రముఖ జర్నలిస్టుయండి. ఉస్మాన్ ఖాన్ అభినందించారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు జానిమియా,మున్నిషాబేగం,బడేబీ, రహీం,జమాల్,సిద్దా సాహెబ్ , గ్రామస్తులు అవిరినేని సత్యనారాయణ, షేక్ జమాల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: