మన్యం మనుగడ కరకగూడెం: నిత్యావసరాల ధరలు తగ్గించాలని లేనిపక్షంలో నీవైన గద్దె దిగిపోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గద్దల శ్రీనివాస రావు అన్నారు.మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ నిత్యవసర సరుకులు యొక్క ధరలు తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసన ధర్నాలో భాగంగా కరకగూడెం మండల కేంద్రంలో తహశీల్దారు ఉషా శారద కి వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ధరలను విపరీతంగా పెంచి పేద,మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో పేద ప్రజలు విలవిల్లాడుతున్నారని కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తల్లడిల్లుతున్నారని పెట్రోల్ డీజిల్ ధరలను సామాన్యుడు భరించలేనంతగా కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచుతూపోతున్నదని అన్నారు. 2014లో 60-70 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ 100 రూపాయలు దాటిందని దాదాపు ఇదే స్థాయిలో డీజిల్ ధరలను కూడా పెంచిందని రూ450 లుగా ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర 1055 కి పెరిగిందని గ్యాస్ సబ్సిడీ సిలిండర్ ధరలను భారీగా పెంచింది ఈ పెరుగుదల వల్ల అన్ని రకాల వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి సామాన్య ప్రజల జీవన ప్రమాణాల తో సంబంధం లేకుండా సుంఖాలు పన్నులు ప్రజలపై నిత్యం వేస్తున్నది మరోవైపు లక్షల కోట్ల రూపాయలు రాయితీలను పెట్టుబడి దారులకు కట్టపెడుతూ కేంద్రం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టుల భర్తీ మాట ఎత్తడం లేదని పేద ప్రజల ద్వారా ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే అంతకంటే ఎక్కువ భారాన్ని ప్రజలపై వేస్తున్నారని వారు దుయ్యబట్టారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్వంసకర విధానాల వల్ల సామాన్య ప్రజలు మరింత కునారిల్లే పరిస్థితి ఏర్పడతున్నాయని రానున్న రోజుల్లో లో కేంద్ర అ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కార్యదర్శులు కొమరం. కాంతారావు,తోలెం.లక్ష్మయ్య నాయకులు చర్ప.సత్యం,తాటి సతిష్,కణితి.రాము తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: