CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బండి సంజయ్ ముస్లిం లపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదు.--:కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండల కేంద్రంలోని మస్జిద్ కమిటీ ఆధ్వర్యంలో మండల ముస్లిం మైనార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన జిల్లా ముస్లిం మైనార్టీ నాయకులు మరియు కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ 

ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా జయంతి వేడుకలో తెలంగాణ బి.జె.పి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నారు.

మస్జిద్ పునాదులు తవ్వి వాటి కింద శవాలు వస్తే ముస్లిం లయి,శివలింగాలు వస్తే హిందువులాయి అని అన్నారు.అలాగే ఉర్దూను లేకుండా చేస్తాం,మదర్సాలను నిషేధిస్తాం,ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తాం అని చేసిన అనుచిత వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయన్నారు.ఈ భారతదేశంలో పుట్టిన భారతీయ ముస్లింలం,హిందూ ముస్లిం భాయి భాయి గా బ్రతుకుతున్నాం.ఖబర్దార్ బండి సంజయ్ నీకు దమ్ముంటే ఏ ఒక్క మస్జిద్ పునాదులను త్రవ్వి చూడు నీకే తెలుస్తుంది అన్నారు.భారత దేశంలో హిందూ ముస్లిం భాయి భాయి గా బ్రతుకుతున్న ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చ కొట్టడం మానుకోమన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ యాకూబ్,ఎస్ కే అబ్దుల్లా,షేక్ రఫీ,షేక్ అజ్జు,ఎక్కే. యాకూబ్,సలీం,పఠాన్ శారుక్ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: