మన్యం మనుగడ కరకగూడెం: కరకగూడెం మండల పరిధిలోని కొత్తగూడెం,గొల్లగూడెం, అనంతారం,కరకగూడెం,గ్రామపంచాయతీలలో శుక్రవారం ఎంపీపీ రేగా కాళికా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పంచాయతీలోని నర్సరీలు డంపింగ్ యార్డ్ పల్లె పకృతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల అభివృద్ధిలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆమె అన్నారు.కార్యదర్శులు సర్పంచులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సమస్యలు లేకుండా చూడాలని ఏ సమస్య ఉన్నా త్వరితగతిన పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఐదవ విడత పల్లె ప్రగతి ఈ కార్యక్రమానికి సన్నద్ధం కావాలని నర్సరీలలో మొక్కలు సిద్ధం చేయాలని ఆమె ఆదేశించారు.నర్సరీలను నిత్యం పర్యవేక్షిస్తూ వాటర్ పడుతూ ఉండాలని మొక్కల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని ఆమె అన్నారు. జీవకోటికి మొక్కల ఆధారమని మొక్కలు పెంచడం వాటిని సంరక్షించడం మాన అందరి బాధ్యత అని అన్నారు. అనంతరం కొత్తగూడెం గ్రామపంచాయతీలో అంగనవాడి స్కూల్ మరమ్మత్తుల కోసం ఎంపీపీ నిధుల నుండి రెండు లక్షలు మంజూరు చేశామని తెలిపారు. మరమ్మత్తుల పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. పిల్లలకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని పాఠశాలను అందంగా తీర్చిదిద్దాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ,శ్రీనివాస్. జడ్పిటిసి,కొమరం కాంతారావు, ఎంపీటీసీ మునీంద్ర, అన్ని పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులు ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: