మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన తెరాస పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు నూక వెంకటేశ్వర్లు మృతి తెరాస పార్టీకి తీరని లోటని తెరాస పార్టీ ఏటూరు నాగారం మండల అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్ అన్నారు. నూక వెంకటేశ్వర్లు చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మృతి చెందడం వారి కుటుంబాన్ని తెరాస పార్టీ పక్షాన వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని వారు అన్నారు. వెంకటేశ్వర్లు 2001 ఉద్యమ సమయంలో ఏటూరు నాగారం నుండి ఎంపీటీసీ గెలుపొంది తెరాస పార్టీ బలోపేతానికి కృషి చేశారని అన్నారు.వెంకటేశ్వర్లు అకాల మరణం పార్టీకి తీరని లోటని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పోరిక గోవింద నాయక్, తెరాస పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కూనూరు అశోక్ గౌడ్, ఏటూరు నాగారం పట్టణ అధ్యక్షులు ఎండి ఖాజా పాషా, సర్దార్ పాషా, సప్పిడి రామ నరసయ్య, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కునూరు మహేష్, ధనపు నేని కిరణ్, కుమ్మరి చంద్రబాబు, కొండాయి చిన్ని, తాళ్లపల్లి మోహన్, గండేపల్లి నరసయ్య, జాడి భోజ రావు, ఎండి ఆరిఫ్, ఎండి చాంద్, తాడూరి రఘు, ఖాతా యాదగిరి, రామ గాని ప్రమోద్, వావిలాల ముత్తయ్య, నూతి రమేష్, చెన్న రాంబాబు, చెన్న బిక్షపతి, బూర వెంకన్న, గాదె లింగా చారి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: