మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరునాగారం మండల కేంద్రంలో ఇటీవల నిరు పేద కుటుంబానికి చెందిన కొప్పుల కృష్ణ (27) అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంగళవారం శ్రీ రామకృష్ణ సేవా ట్రస్టు సభ్యులు బాడిశ నాగ రమేష్ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు.మృతి చెందిన కృష్ణకు వివాహం జరిగి 3 సంవత్సరాలు అవుతుంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.చేతికి అందిన కొడుకు చిన్న వయసులోనే మృతి చెందడంతో భార్య తల్లి దండ్రుల కుటుంబ పోషణ ప్రశ్నా ర్థకంగా మారిందని తెలిపారు. మృతుని భార్యకు కుటుంబా పోషణ కోసం ఉపాధి కల్పించాలని రామ కృష్ణ సేవా ట్రస్టు సభ్యులను కోరగా వారు తప్పకుండా మా ట్రస్టు నుండి సహాయ సహకారాలు అంది స్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో కొమరం .వికాస్,బోడ ప్రవీణ్ కుమార్,బాడిశ నవీన్, జై భీమ్ రామ్మోహన్,జయరాజు,చిట్యాల రాజశేఖర్ ,యెంపెల్లి.రాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: