మన్యం మనుగడ ఏటూరు నాగారం
ఏటూరు నాగారం ఐటిడిఎ పరిధిలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులు ఏటూరు నాగారం ఐటిడిఎ ఆధ్వర్యంలో జూన్ నాలుగవ తారీకు రోజున ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ నందు నిర్వహించే జాబ్ మేళా ను నిర్వహిస్తున్నట్లు మంగళవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో మార్కెటింగ్, సేల్స్ & రే టైల్స్, సెక్యూరిటీ గార్డ్, టెలీ-కాలర్స్, ఏసి రిపేర్, మెడిసిన్ ఫెబ్రికేషన్ వర్క్స్, కాల్ సెంటర్ నందు ఉపాధి అవకాశాలు కలవని, విద్యా అర్హతలు పదో తరగతి,ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా చదివి, 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య వయసు వారు అర్హులు అని అన్నారు. ఆసక్తిగల గిరిజన నిరుద్యోగ యువతీ,యువకులు ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవ న్ నందు నిర్వహించే జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి సమాచారం కొరకు 9490341911 సంప్రదించగలరు అని, ఈ సందర్భంగా ఐ టి డి ఎ ప్రాజెక్ట అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post A Comment: