మన్యం మనుగడ, అశ్వారావుపేట: జూన్ ఒకటో తేదీ నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గం లో అధినేత్రి వైయస్ షర్మిల పిలుపు మేరకు, నిర్వహించబోయే ఇంటింటికీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ అశ్వారావుపేట నియోజవర్గం యువ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి పెనుబల్లి రమేష్ బాబు కోరారు. ఇందులో భాగంగా మండల అధ్యక్షులు, పార్టీనాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు గ్రామ గ్రామాన ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పథకాలను, ఆయన సంక్షేమ పాలనను గుర్తు చేస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల పాదయాత్రలో ప్రజలకు ఇస్తున్న హామీలను ప్రజలకు తెలియజేస్తూ, మళ్లీ వైయస్ షర్మిల తోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన సాధ్యం అవుతుందనే విషయాన్ని ప్రజలకు వివరించాలని పిలుపునివ్వడం జరిగింది.
Navigation
Post A Comment: