మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ : టిఎస్ఆర్టిసి నుండి ఉచిత బస్సుపాస్ లను సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ కొత్తగూడెం డిపో మేనేజర్ సి ఆర్ పి శ్యామెల్ సూచించారు. బుధవారం చండ్రుగొండ పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఉచిత బస్సుపాస్ మేళాలో దివ్యాంగులకు బస్సుపాస్ లను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... దివ్యాంగుల సదరం సర్టిఫికెట్లను పరిశీలించి బస్సుపాస్ లను అందజేయడం జరుగుతుందన్నారు.బస్సుపాస్ లను పొంది ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిస్టమ్ ఆపరేటర్ వాసు, పంచాయతీ కార్యదర్శి ఉపేందర్, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు, దివ్యాంగుల సంఘం బాధ్యులు పాల్గొన్నారు.
Post A Comment: