మన్యం మనుగడ,మంగపేట మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామ పంచాయితీ శనగకుంట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన 32ఆదివాసీ కుటుంబాలకి అండగా రాజుపేట గ్రామస్తులు ముందుకి వచ్చారు. ఈమేరకు బుధవారం రాజుపేట గ్రామస్తుల అందరి తమ వంతుగా గ్రామం తరపున రూ, 1,02400/-ల నగదును సమకూర్చి శనగకుంట గ్రామలోని అగ్ని ప్రమాద భాదిత కుటుంబాలకిఅందజేశారు .ఆపదలో తమకి అండగా ఉన్న రాజుపేట గ్రామస్తులకు శనగకుంట బాధిత కుటుంబాలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజుపేట గ్రామస్తులు తుమ్మలముఖర్జీ ,యడ్లపల్లి నరసింహరావు,పోలిన హరిబాబు, కొమరం నర్సయ్య (టీచర్), అనుముల రాఘవరెడ్డి, బండ్ల వాసుబాబు,భవనం శ్రీనివాసరెడ్డి ,చదలవాడ సాంబశివరావు, వణుకూరి పేరయ్య, విశ్వే శ్వర్ రావు ,నాని తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: