మన్యం మనుగడ, మంగపేట మంగపేట
మండలంలోని బుచ్చంపేట గ్రామానికి చెందిన అక్కిపెళ్లి సుజాత ఇటీవల పొలం పనులకు వెళ్లి పాము కాటుకు గురై వరంగల్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయాన్ని గ్రామానికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో పోస్ట్ చేయగా,దాతల నుంచి వచ్చిన రూ,15,000/- ల నగదు ఆర్ధిక సహాయాన్ని బుధవారం వరంగల్ లోని హాస్పిటల్ లో వారి కుటుంబానికి "వాఁట్స్ అప్ గ్రూప్ అడ్మిన్స్" అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంభం వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న మా గురించి తెలుసుకొని సహాయం అందజేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మద్దెల లక్ష్మయ్య, ఉగ్గుమల్ల గణేష్, పత్తి రవీందర్, పల్లె నాగరాజు, ముత్యం రాము, గడ్డం చిన్న ఉప్పలయ్య, ఎడ్ల వెంకన్న, పత్తి వెంకటేష్, ఎలిశాల ప్రవీణ్, ఎన్నమల్ల విజయ్, ఎడ్ల శ్రీను, ఎంపెళ్లి సమ్మయ్య, కొప్పుల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: