మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట పట్టణంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొగళ్ళపు చెన్నకేశవరావు ఇంటి దగ్గర సమావేశంలో మెుగళ్లపు చెన్నకేశవరావు మరియు సున్నం నాగమణి జెడ్పీటీసీ ముల్కలపల్లి మరియు టీపీసీసీ మెంబర్ మాట్లాడుతూ మెతుకు పండించే రైతు బతుకు కోసం రాహుల్ గాంధీ సారధ్యంలో రణం చేద్దాం కదలిరండి రైతు సంఘర్షణ సభకు పిలుపు ఇవ్వటం జరిగింది. ఈ నెల 6 తేదీన సాయంత్రం 5:30 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కళాశాల లో నిర్వహించే ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ హాజరుకానున్నరని రైతు సంఘర్షణ సభ జయప్రదం చేయాలని సున్నం నాగమణి పిలుపునివ్వటం జరిగింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కలిసి ఎరువులు, పురుగు మందుల ధరలు పెంచి రైతుల నడ్డి విరిగేలాగ చేశారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 8400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతుల దగ్గర నుంచి సరైన టైమ్లో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుకు నష్టం వచ్చేలా చేయటం జరిగిందని, వరి వేస్తే ఉరి అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను భయబ్రాంతులను చేయడం కూడా జరిగిందని, కరెంటు ఛార్జీల కూడా పెంచి రైతులు వెన్నెముక విరిగేలాగా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. ఈ సందర్బంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బూతు నుండి 10 మందికి తగ్గకుండా కాంగ్రెస్ నాయకులు, రైతులు కార్యకర్తలు ప్రతి నియోజకవర్గం నుండి భారీగా తరలివచ్చి వరంగల్లో రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలని మొగళ్లపు చెన్నకేశవరావు మరియు సున్నం నాగమణి కోరుకున్నారు.
Post A Comment: