CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పి వై ఎన్ జనరల్ బాడీ సమావేశం జయప్రదం చేయండి :- రాష్ట్ర ఉపాధ్యక్షులు వాంకుడోత్ అజయ్.

Share it:

 


గుండాల మే 5(మన్యం మంగళం) ప్రగతిశీల యువజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనరల్ బాడీ సమావేశం ఈనెల తొమ్మిదో తారీఖున ఇల్లందు లో నిర్వహించడం జరుగుతుందని ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని పీ వై ఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాంకుడోత్ అజయ్ పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో పి వై ఎల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి అనంతరం ఆయన మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడం మాత్రం మరిచింది అన్నారు. సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిందని ఏండ్లు గడుస్తున్నా వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ ప్రభుత్వ పరంగా సంస్థలను నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇలానే కొనసాగితే ముందు ముందు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కట్టబెడతారు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పి వై ఎల్ మండల కార్యదర్శి ఈసం కృష్ణ , నాయకులు నరేష్ , సనప కృష్ణ , కోడూరి జగన్, పూనం కృష్ణ , రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: