మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సీతంపేట గ్రామంలో గుండారపు ప్రవీణ్ - కావ్య ల వివాహ వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ , పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సీతంపేట గ్రామానికి చెందిన ఉసిల్ల శంకరయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండగా వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకొని భరోసా కల్పించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదివేల రూపాయల నగదును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు, అభిమానులు ప్రజలు పాల్గొనడం జరిగింది
Post A Comment: