మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం:అంగన్వాడీ టీచర్స్ ఆయా లపై సిబ్బంది వేధింపులు అరికట్టాలి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్,
అనారోగ్యం పేరుతో పినపాక నియోజకవర్గం లో పని చేస్తున్న స్థానికేతారా సిబ్బంది ని బదిలీ చెయ్యాలి.అక్రమ డిప్యూటేషన్ లను రద్దు చెయ్యాలి బొల్లోజు అయోధ్య ఏఐటీయూసీ పినపాక నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు
అశ్వాపురం లో సీఐటీయూ నుండి ఏఐటీయూసీ లో 15 మంది అంగన్వాడీ టీచర్లు చేరిక
ఐ సి డి ఎస్ డిపార్ట్మెంట్ లో పినపాక నియోజకవర్గం లో అంగన్వాడీ టీచర్స్ ఆయా లను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని కొంతమంది అధికారుల తీరు మార్చుకోకపోతే ప్రతక్ష ఆందోళన లు నిర్వహిస్తామని ఏఐటీయూసీ పినపాక నియోజకవర్గం గౌరవ అధ్యక్షులు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరటి ప్రసాద్ లు తెలిపారు. గురువారం ఉదయం అశ్వాపురం ఏఐటీయూసీ కార్యాలయం లో జరిగిన అంగన్వాడీ టీచర్స్ యూనియన్ అశ్వాపురం మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు ప్రసంగిస్తూ స్థానిక ప్రాజెక్ట్ లలో అంగన్వాడీ టీచర్ గా పనిచేసిన వారిని అదే ప్రాజెక్ట్ లో సూపర్వైజర్ గా అధికారులు గా నియమించడం వలన అనేక సమస్య లు వొస్తున్నాయని సంస్థ ఉన్నత అధికారులు స్పందించి అక్రమంగా డిప్యూటేషన్ పద్ధతి న విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ని తక్షణమే నియోజకవర్గం నుండి వారి ఉద్యోగ స్థలాలకు పంపాలని వారి డిప్యూటేషన్ లను రద్దు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్బంగా అశ్వాపురం సర్కిల్ లో 15 మంది అంగన్వాడీ టీచర్ లు సీఐటీయూ నుండి ఏఐటీయూసీ లో చేరారు వారికీ ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నరటి ప్రసాద్ ఏఐటీయూసీ కండువాలు కప్పి సాధారంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమం లో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ మండల అధ్యక్షులు రాయపూడి రాజేష్ అంగన్వాడీ యూనియన్ నాయకులు రాయల భారతి అరుణ వాసం రమాదేవి కమలా కే నారాయణమ్మ టీ మంగతాయి కే విజయలక్ష్మి టీ రంగమ్మ పి సూర్య కాంతమ్మ కే సరళ జయ సుధారాణి రత్న కుమారి సరోజినీ విజయవిలాసం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: