మన్యం మనుగడ, మంగపేట.
రెండో యాదగిరి గుట్ట గా ప్రసిద్ధి చెందిన ములుగు జిల్లా,మంగపేట మండలం లోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగాశనివారం వసంతోత్సవం వేడుకతో ముగిసాయి. దేవస్థానం కార్యనిర్వాహణాధికారి శ్రవణం సత్యనారాయణ పర్యవేక్షణల నడుమ నిర్వహణ అర్చకులు అమరవాది మురళి కృష్ణామాచార్యులు, ఆలయ అర్చకులు కైంకర్యం రాఘవచార్యులు, ముక్కామల రాజశేఖరాశర్మ, కారంపూడి పవన్ కుమారచార్యులు, ఈశ్వరాచంద్ తదితరులు ఆలయం లోని మూల విరాట్ తో పాటు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణ చేసిన పల్లకిలో గజ వాహనం పై శ్రీ లక్ష్మి నరసింహ స్వామి- ఆదిలక్ష్మి, చెంచు లక్ష్మి అమ్మవార్లను ఊరేగింపు, వసంత ఉత్సవం నిర్వహించడం జరిగింది.
Post A Comment: