- -మేము ఎక్కడికి పోము కలెక్టర్ గారూ... రైతులు
- -అప్పటి కలెక్టర్ ఎన్ వి రెడ్డి ఆ స్థలాన్ని రైతులకు కేటాయించారు
- -ధాన్యం ఆరబోతకు రైతులు అవస్థలు
- -స్థలాన్ని మాకు కేటాయించినట్టు పూర్తి ఆధారాలు ఉన్నాయి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మొండికుంట, మల్లెమడుగు రైతులు తమ పండించిన పంటలను ఆరబోచుకునే స్థలాన్ని గతం లో పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, వైకుంఠ దామం కూ, నర్సరీ కి వాడుకున్నారు ఇప్పుడు మరలా ఇప్పుడు క్రీడా స్థలాలకు మరియు బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు కోసం కేటాయించడం అన్యాయమని, ఎన్నో సంవత్సరాల నుండి తమ పంటను ఆరబోచామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఇదే విషయమై అప్పటి జిల్లా కలెక్టర్ కు విన్నవించామని, ఆ కలెక్టర్ తాసిల్దార్ ని పూర్తి సమాచారం తమకు పంపమని ఆదేశించారని, దానికి జిల్లా కలెక్టర్ ఎమ్ వి రెడ్డి సహకార సంఘం ఆధ్వర్యంలో ఆ స్థలాన్ని రైతులకు కేటాయించారని అన్నారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఇరు గ్రామాల ప్రజలు తెలిపారు. రెండు గ్రామపంచాయతీ పరిధిలో సుమారు ఆరు వేల ఎకరాలలో పంట పండిస్తామని ధాన్యం ఆరబోయడానికి స్థలం లేక అవస్థలు పడుతున్నామని తెలియజేశారు. అధికారులు స్పందించి, జిల్లా కలెక్టర్ దృష్టిసారించి ఆ స్థలాన్ని రైతులు ధాన్యం ఆరబోసుకునే స్థలంగా కేటాయించాలని వేడుకుంటున్నారు అదే విధంగా జిల్లా పంచాయతీ అధికారిDPO గారికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో అశ్వాపురం మండలం ZPTC మరియు అశ్వాపురం సహకార సంఘం అధ్యక్షుడు తుక్కని.మదు , మాజీ చైర్మన్ కమటం.వెంకటేశ్వర్లు,సర్గం. బాలనర్సయ్య, ముసుకు శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మల్లికార్జున, రవి, సురేష్, కోడి.వెంకన్న మొదలగు రైతులు అందరూ పాల్గొన్నారు.. మీ కర్నె రవి.. Good night
Post A Comment: