మన్యం మనుగడ, అశ్వరావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, రచ్చబండ కార్యక్రమం అశ్వరావుపేట మండలం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు మొగళ్ళపు చెన్నకేశవ రావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు అధిక సంఖ్యలో పాల్గొని నెల రోజుల పాటు జరిగే ఈ రచ్చబండ కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు మన రాష్ట్రంలో రైతులు మనకు వెన్నెముక లాంటి వారు మండలంలో ప్రతి గ్రామం ప్రతి గడప తిరిగి వారి సమస్యలను తెలుసుకుంట మన్నారు మన దేశానికి రైతే రాజు, రైతు లేకపోతే మనుగడ లేదు, రైతును ఏడిపించిన ఏ ప్రభుత్వం బాగు పడలేదు రాబోయే రోజులలో కెసిఆర్ పతనానికి రైతులు ముందంజలో ఉంటారు అన్నారు. రైతుల జీవితాల్లో వెలుగు నింపేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రైతు డిక్లరేషన్ రెండు లక్షల రైతు రుణమాఫీ, ఇందిరమ్మ రైతు భరోసా పథకం, కౌలు రైతులకు ఏడాదికి 15 వేల రూపాయలు, ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాదికి పన్నెండు వేల రూపాయలు, అన్ని పంటలకు గిట్టుబాటు ధర, మూతబడిన కర్మాగారాలను పునర్వ్యవస్థీకరణ చట్టం, పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంటల బీమా పథకం, ధరణి పోర్టల్ రద్దు, పోడు భూముల రైతులకు అసైన్డ్ భూముల లబ్ధిదారులకు క్రయవిక్రయాలలో యాజమాన్య హక్కులు కల్పిస్తాం, నకిలీ విత్తనాలు పురుగుమందులు విక్రయాలపై ఉక్కుపాదం, రైతులకు నష్టపరిహారం, బాధ్యులపై పిడి యాక్ట్, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రతి ఎకరాకు సాగునీరు అందించడం, రైతు మిషన్ పైన ఇచ్చిన కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మండల కాంగ్రెస్ అధ్యక్షులు మిగతా నాయకులు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఓ బి సి అధ్యక్షులు తుమ్మ రాంబాబు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బూషి పాండు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు రాజేష్, జె దుర్గారావు, మండల ఓబిసి అధ్యక్షుడు బండారు మహేష్, పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు జల్లిపల్లి దేవరాజు, ఎంపీటీసీ సత్య వరపు బాలయ్య, మండల కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: