మన్యం మనుగడ పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో వారి నివాసానికి వెళ్లి వారిని సోమవారం నాడు పరామర్శించి యోగ క్షేమాల గురించి టిఆర్ఎస్ నాయకులు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావు, పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ముదునూరి డాక్టర్ రవి శేఖర్ వర్మ, మణుగూరు టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి బోలిశెట్టి నవీన్, సర్పంచ్ లు మొగిలిపల్లి నరసింహారావు, బాడిశ మహేష్, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు గాండ్ల అశోక్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు సాగిరాజు బుల్లిబాబు, బోడ ఈశ్వర్, వెంకట్ రెడ్డి, గుండం దామోదర్, ధర్మారావు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: