మన్యం టివి దుమ్ముగూడెం:: దుమ్ముగూడెం గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో యలమంచి సీతారామయ్య ట్రస్టు ద్వారా దుమ్ముగూడెం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం కుప్పిలి వెంకట రమణ వారి సతీమణి లక్ష్మీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గత వారం రోజుల క్రితం మరణించగా సిపిఎం పార్టీ గ్రామ శాఖ ఈ రోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయంగా 3000/- రూపాయలు 50 కేజీల బియ్యం ట్రస్ట్ కన్వీనర్ శ్రీనుబాబు చేతుల మీదుగా అందించారు. అలాగే దుమ్ముగూడెం గ్రామ శాఖ సభ్యులు దల్లి వేణు సానుభూతి తెలియజేస్తూ ₹1000 అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గ్రామ శాఖ సెక్రెటరీ బర్రి నరసింహారావు , సభ్యులు బైరెడ్డి సతీష్, హుస్సేన్అహ్మద్,త్రినాద్, సాయి,ఎడ్ల శంకర్ ,తెల్లం ధర్మయ్య, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: