మన్యం టివి దుమ్ముగూడెం:: దుమ్ముగూడెం మండలంలోని మారాయిగూడెం గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 98వ వర్ధంతి సందర్భంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి స్థానిక సర్పంచ్ తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం దుమ్ముగూడెం మండల కార్యదర్శి తిరుపతి రావు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన మహోన్నత విప్లవ వీరుడు అని ఆయన యొక్క స్ఫూర్తి తోటి భవిష్యత్తులో గిరిజన హక్కులు చట్టాలను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర పాలక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు 1924 మే 7వ తేదీన మరణించారని విప్లవ వీరుడు తరతరాలుగా ఆదివాసీలు కోసం పోరాటాలు చేశారు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సోయం బాలయ్య, తోడం జోగారావు, ఎర్రయ్య, సాంబయ్య, నాగయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: