మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఏన్కూరు, జూలూరుపాడు మండలాలకు చెందిన 12 మంది లబ్ధిదారులకు 3 లక్షల 18, వేల 500 రూపాయలు విలువగల కళ్యాణ లక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం పి పి సోనీ, జెడ్ పి టి సి కళావతి, వైస్ ఎంపీపీ నిర్మల, మండల పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, రైతు సమితి మండల కన్వీనర్ యదళ్ళపల్లి వీరభద్రం, పార్టీ నాయకులు ఎల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు, రోకటి సురేష్, జూలూరుపాడు ఎంపీటీసీ రాజశేఖర్, కాకర్ల ఎంపీటీసీ సతీష్ కుమార్, కొత్తూరు సర్పంచ్ వెంకట లక్ష్మి, బేతాళపాడు సర్పంచ్ రాందాస్ నాయక్, బొజ్యా తండా సర్పంచ్ కిషన్ లాల్, కరివారి గూడెం సర్పంచ్ శాంతి రామ్, ఉద్యమ నాయకులు వేల్పుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: