గుండాల ఏప్రిల్ 30(మన్యం మనుగడ) తమతో పాటు చదువుకొని ఆపదలో ఉన్న స్నేహితురాలిని ఆదుకున్న మిత్ర బృందం. ముత్త పురం గ్రామానికి చెందిన పునెం సమ్మక్క భర్త సత్యం అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ విషయం తెలుసుకున్న సమ్మక్క తోపాటు చదువుకున్న మిత్రులు అందరూ కలసి 12200 రూపాయల ఆర్థిక సహాయాన్ని శనివారం ఆమె స్వగృహానికి వెళ్లి అందజేశారు. ఆపదలో ఉన్న స్నేహితురాలిని ఆదుకున్న మిత్రులందరినీ అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మక్క మిత్రులు లక్ష్మీనారాయణ, జగన్, కృష్ణారావు, శ్రీనివాస రావు, చంద్రయ్య, నరసింహారావు, మంగు, నవీన్, ప్రసాద్, సుధాకర్, కైసర్, జావిద్, విజయ కుమారి, రమ్య, శాంతి, ఝాన్సీ, మాధవి, బాయమ్మ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు
Post A Comment: