మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండల కేంద్రంలోని ఏజెన్సీ1/70 చట్టప్రకారంగా ఎస్టీ లబ్ధిదారులకు 15 కుటుంబాలు, పక్క గ్రామపంచాయతీ బెండాలపాడు 25 ఎస్టీ కుటుంబలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి, లాటరీ పద్ధతిలో కేటాయించే సమయంలో స్థానిక దళితులు, వారికి మద్దతుగా కాంగ్రెస్, టీడీపీ,సీపీఎం,ఏబీవీపీ నాయకులు వచ్చి ఇక్కడ స్థానిక దళిత కుటుంబలకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని, డబల్ బెడ్ రూమ్ లాటరీని అడ్డుకున్నారు. స్థానిక నిరుపేద దళిత కుటుంబలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని నినాదాలు చేసి, డిమాండ్లతో కూడిన వినతిని తహసిల్దార్ కి అందజేశారు. ఈ సందర్భంగా మండల తహసిల్దార్ వి రవికుమార్ మాట్లాడుతూ..డబుల్ బెడ్ రూమ్ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యకు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి, డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లాటరీని వాయిదా వేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొనకళ్ల వెంకటరెడ్డి, టిడిపి మండల అధ్యక్షుడు వారధి సత్యనారాయణ, సిపిఎం మండల నాయకులు వేణు, ఏబీవీపీ మండల అధ్యక్షుడు రాయి రాజా, ఎంపీటీసీ దార బాబు,డిప్యూటీ తహసిల్దార్ ప్రసన్న,ఆర్ఐ ముత్తయ్య, వీఆర్వోలు నాగరాజు, నరసింహమూర్తి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: