CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సంక్షేమంలో సాటిరారు మనకు ఎవ్వరు :- పేదల పాలిట వరం కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ :- గుండాల పర్యటనలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:

 

గుండాల మే 16(మన్యం మనుగడ) సంక్షేమ పథకాల లో సాటి రారు మనకు ఎవ్వరు అని ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం మండలంలో పర్యటించిన ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 27కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం తీసుకో వచ్చి ఆడబిడ్డల తల్లిదండ్రులకు కొండంత భరోసాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చారన్నారు. కరుణ కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూ అభివృద్ధిలో దూసుకుపోయే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తున్నారు అన్నారు. మిషన్ భగీరథ నీళ్లతో రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు. అలాంటిదే నేతకు మనమందరం అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి రామక్క, ఎంపీపీ ముక్తి సత్యం, ఆళ్ల పల్లి ఎంపీపీ మంజుభార్గవి, తాసిల్దార్ కిషోర్, ఎంపీడీవో హజరత్ అలి, గుండాల సర్పంచ్ గుండాల సర్పంచ్ సీతారాములు, ఎంపీటీసీ సంధాని, తదితరులు పాల్గొన్నారు


Share it:

TS

Post A Comment: