గుండాల మే 16(మన్యం మనుగడ) పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సోమవారం మండలం లో పర్యటించి నూతన సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. ముత్తపురం గ్రామంలో 10 లక్షల రూపాయలతో రెండు సిసి రోడ్లకు సాయన్న పల్లి గ్రామంలో ఐదు లక్షల రూపాయలతో ఒక సిసి రోడ్డుకు నిధులు మంజూరు చేయడంతో శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు భవాని శంకర్, వట్టం రాంబాబు, జడ్పిటిసి రామక్క,గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ సమ్మయ్య,ఎంపీటీసీ కృష్ణారావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భాస్కర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగయ్య, మోకాళ్ళ వీరస్వామి, గడ్డం రమేష్ , నీట్ట రాములు, అబ్దుల్ నబి, తాటి కృష్ణ , బొమ్మెర శ్రీనివాస్, మల్లయ్య , లక్ష్మీనారాయణతదితరులు పాల్గొన్నారు
Post A Comment: