మన్యం మనుగడ : జూలూరుపాడు, మే 10 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండల పరిధిలోని మాచినేని పేట తండా గ్రామంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నారుపాడు గ్రామానికి చెందిన ధరంసోత్ నరేష్ (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ద్విచక్రవాహనంపై కొత్తగూడెం నుండి ఇంటికి వస్తున్న క్రమంలో మాచినేని పేట తండా వద్ద పశువులు అడ్డురావడంతో ఆగిన క్రమంలో కొత్తగూడెం నుండి ఖమ్మం వైపు వెళ్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, గాయాలపాలై బైక్ పై ఉన్న మరో వ్యక్తి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించానని తెలిపాడు. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసును దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: